లండన్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తున్న మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నింటినో జరుపుకోవాలని ఆకాక్షించారు. తనదైన పని తీరుతో కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారని కొనియాడారు. అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వీరా మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి మనమంతా ఎల్లపుడు కేటీఆర్ వెంటే ఉండి వారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
ఎన్నారై టీఆర్ఎస్ లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రిగా తన పనితీరుతో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఇటువంటి మంత్రి తమకు ఉంటే బాగుండనని ఇతర రాష్ట్రాల ప్రవాసులు అనుకుంటారన్నారు. సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారైలంతా గర్వపడేలా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు తెలంగాణలో ఉండడం అందరి అదృష్టమన్నారు.
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకే అధికార ప్రతినిధి రవి రేటినేని మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ వృద్దికి కృషి చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువచ్చారని కొనియాడారు. కేటీఆర్ను యువతరం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకే అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కేటీఆర్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.