హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను (17 న భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 9:00 గంటలకు) టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..గెల్లు అభ్యర్థిత్వానికి ఎన్నారైల తరపున మద్దతు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించాలని ఎన్నారైల తరఫున ప్రచారాన్ని చేస్తున్నామని ఆయన తెలిపారు.