హైదరాబాద్ : ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన, వివిధ దేశాలలో చేపట్టే కార్యక్రమాలను సీఎంకు తెలియ జేశారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించారు.
అమెరికా పర్యటన ముగించుకున్న మహేష్ బిగాల అక్కడి వివరాలను తెలియజేస్తూ నవంబర్లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Rakesh Tikait : జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్కతా కెప్టెన్ మోర్గాన్కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం