హైదరాబాద్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. తన ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించారని, జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని చెప్పారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో అలుమ్ని అసోసియేషన్ తరపున జరిగిన ఇంజినీరింగ్ సెలబ్రేషన్స్లో మహేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (సెప్టెంబరు 15) సందర్భంగా ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటున్నామని చెప్పారు.
ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారని చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో చేపట్టిన నిర్మాణాలు నేటికీ చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదన్నారు. దేశంలోని యువ ఇంజినీర్లు దేశాన్ని నిర్మిస్తున్నారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్పూర్తితో ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు.
అనంతరం బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ తరపున కాలేజీలో అత్యంత ప్రతిభ కనబర్చిన వారికి, టీఎస్ ఈసెట్లో మంచి ర్యాంక్స్ సాధించినవారికి ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు.