హైదరాబాద్ : మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలను అభినందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. పీవీ శత జయంతి ఉత్సవాలు విజయవంతం అవడంలో ఎంతోమంది చేయూతనిచ్చారన్నారు. దేశ విదేశాలలో ఉన్న పీవీ అభిమానులని అందరిని ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. పార్టీలకు అతీతంగా సహకారం అందించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్నారై సంఘాలకు మహేష్ బిగాల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే
ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అభినందిన సీఎం కేసీఆర్, సహకారం అందించిన కేశవ రావు, పీవీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం