హైదరాబాద్ : సింగపూర్లోని ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం, కన్యపిల్లలకు విశేషంగా కన్యపూజలు, సామూహిక కుంకుమార్చన అనంతరం రథోత్సవాన్ని భక్తుల జయజయద్వానాల మధ్య కనుల పండువగా సాగింది. కార్యక్రమానికి అతిథులుగా ఆలయ చైర్మన్ కదిరీషన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్తో పాటు కృష్ణశర్మను క్లబ్ వ్యవస్థాపకులు వెంకటనాగరాజ్ కైలా, మాజీ సెక్రెటరీ శ్రీధర్ సన్మానించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు అరుణ్కుమార్ గొట్లూర్ మాట్లాడుతూ.. కొవిడ్ పరిస్థితుల తర్వాత ప్రత్యక్షంగా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయ జీర్ణోద్ధరణలో పాల్గొనాలని క్లబ్ సెక్రెటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి వైశ్యులను కోరారు. ధర్మాన్ని విడనాడకుండా మరెన్నో సేవాకార్యక్రమాల్లో ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్లబ్ కమిటీ సభ్యులు ముక్కా కిశోర్, రాజా విశ్వనాథుల, మకేశ్ భూపతి, మురళి పబ్బతి, శివాజీ, కిశోర్, వినయ్, శివ, నరేశ్, ఫణీష్, వినోదన్ ఆర్యవైశ్యులు అభినందనలు తెలిపారు.