UK Visa to Indian Students | ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేందుకు చైనాకంటే బ్రిటన్కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగనున్నది. ఐదేండ్ల క్రితం కేవలం 20 వేల వీసాలు మాత్రమే బ్రిటన్ జారీ చేసేది. కానీ 2021లో లక్ష మంది భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యాకోర్సుల్లో చేరడానికి వీసాలు జారీ చేసిందని భారత్లో బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ చెప్పారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరుగనున్నదని తెలిపారు.
భారత్ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 65 మంది భారతీయులకు బ్రిటన్ స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నది. వచ్చే ఏడాది మరింత మంది స్పాన్సర్లతో స్కాలర్షిప్ల సంఖ్య పెరుగుతుందని అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు లక్ష మందికి విద్యార్థి వీసాలు జారీ చేశాం, ఈ ఏడాది 2021 రికార్డును బ్రేక్ చేస్తామని ఆశాభాం వ్యక్తం చేశరాఉ.
బ్రిటన్లో ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించడానికి వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని అలెక్స్ ఎల్లిస్ చెప్పారు. సమీప భవిష్యత్లో చైనా విద్యార్థులను భారతీయ విద్యార్థులు అధిగమిస్తారన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉన్నత విద్యాకోర్సులు అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులు మొదటి స్థానంలో ఉంటారు. రెండో స్థానంలో భారతీయులు ఉంటారు. భారతీయులకు 44 శాతం స్కిల్డ్ వర్క్ వీసాలు జారీ చేస్తున్నది. రెండు దేశాల్లో పరస్పరం విద్యా కోర్సుల గుర్తింపునకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది.