హైదరాబాద్ : ప్రముఖ ప్రవచన కర్త , ఆధ్యాత్మిక గురువులు, సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించిన విషయము అందరికీ తెలిసిందే. వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలు స్వరపరచబడ్డాయి. శివపద సంగీత, నాట్య ప్రదర్శనలు దేశ విదేశాలలో ప్రపంచ వేదిక పై ఎన్నో జరిగాయి. 2016లో షణ్ముఖ శర్మ రచించినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ సాహిత్యానికి స్వరపరచటం జరిగింది. వీటిని లాల్గుడి బ్రహ్మానందం, అనురాధగారు, బ్రహ్మానందం వీనులవిందుగా స్వరపరిచారు. అమెరికాలో ప్పుట్టి పెరిగిన యువత గానం చేసారు .
వాణీ గుండ్లాపల్లి oneness of god అనే concept తో భారత దేశం లోని 12 ప్రదేశాలలో వ్యాప్తి చెందిన జ్యోతిర్లిగాలు విశిష్టత అందరికి తెలియపరచటం కోసం ఏడు వైవిధ్య శాస్త్రీయ నృత్య రీతులలో, అమెరికా, రష్యా దేశాలలోని 11 నృత్య శిక్షణాలయాలనుంచి 58 మంది గురు- శిష్యుల బృందం, అత్యద్భుతంగా, ఆంధ్ర నాట్యం, కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు.
ఈ సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా జులై 23 వ తేదీ న రుషీ పీఠం యూట్యూబ్ మాధ్యమం గా జరిగిన నృత్య ప్రదర్శన చారిత్రాత్మకంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. సామవేదం షణ్ముఖ శర్మ ఈ సందర్భంగా శివపదాంకిత అని వాణీ గుండ్లపల్లి , రవి గుండ్లపల్లిని అభినందనందించారు.
ద్వాదశజ్యోతిర్లింగగాథల కీర్తన లోని పల్లవిని వివిధ నాట్యశైలుల గురువులందరూ కలిసి ప్రదర్శించారు. తరువాత వరసగా వివిధ జ్యోతిర్లింగ గాథలను కూచిపూడి – రాజేష్ శిష్యబృందం
భరతనాట్యం – చందన శిష్యబృందం, నైనా శిష్యబృందం, ఒడిస్సీ – భిధీష శిష్యబృందం, సీమ శిష్యబృందం, మోహినియట్టం – సరస్వతి శిష్యబృందం, ఆంధ్ర నాట్యం – హేమ శిష్యబృందం, మణిపురి – మిత్ర శిష్యబృందం, కథక్ – ప్రగ్య శిష్యబృందం, దిపన్విత శిష్యబృందం,
నృత్యసభ ఫౌండేషన్, రష్యా – గురుశిష్య బృందం అద్భుతంగా ప్రదర్శించారు.
షణ్ముఖ శర్మ సమన్వయ వ్యాఖ్యానంతో సాగిన నృత్యరూపకం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల గూర్చిన శివపద సాహిత్యం, నాట్యప్రదర్శన చూడటం తమ అదృష్టం అనిరాధిక కామేశ్వరి అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జులుం
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం