హైదారాబాద్ : విజయదశమి పండుగ పురస్కరించుకుని జీఆర్డీ అయ్యర్స్ గురుకుల్ వారు సంస్కృతం భాషలో (హిందీ, ఇంగ్లీష్ అనువాదాలతో) ‘దుర్గా సప్తశతి’ పుస్తకాన్ని అక్టోబర్ 14న న్యూయార్క్ రోచెస్టర్ నగరంలోని శ్రీ విద్యా మందిరంలో ఘనంగా ఆవిష్కరించారు. త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో కూడా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.
350 కలర్ పేజీలతో సరళ భాషలో పలు సూచనలు, చిత్రాలతో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రాం, ప్రచురణ కర్త ‘ట్రూ డ్రీమ్స్టర్’ వెబ్సైట్ లేదా అమెజాన్ Kindle డౌన్లోడ్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. గురుకుల్ వ్యవస్థాపకుడు రమేష్ నటరాజన్ మాట్లాడుతూ..దుర్గా సప్తశతీ లేదా దేవీ మహాత్మ్యం, దుర్గా దేవిని కీర్తించే శక్తివంతమైన 700 మంత్రాల సంహితమని, ఇప్పటిదాకా ఎన్నో పుస్తకాలు ఉన్నా కూడా ఈ పుస్తకం ప్రచురణ వెనుక ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు.
ముందుగా చెప్పుకోవాల్సింది ఆచార్య భాస్కరరాయ మఖిన్ విరచిత ‘గుప్తవతి’ ఈ పుస్తకానికి ఆధారం. దేవీ పారాయణం, పూజ, తర్పణం, మార్జనం, ప్రోక్షణ విధానాలు, చండీ హోమాలకు అనుగుణంగా స్వాహా గుర్తులు, చండీ నవాక్షరీ మంత్రంపై వ్యాఖ్యానం వంటి ఎన్నో నిగూఢ విశేషాలు ఇందులో పొందుపర్చినట్లు తెలిపారు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పుస్తకం దుర్గా సప్తశతి పరాయణలో నిష్ణాతులు, చండీ హోమాలు నిర్వహించడంలో దేవీ ఉపాసనలో అనుభవుఙ్ఞులైన వారిచే సమకూర్చబడింది. దేవీ భక్తులకు, ఉపాసకులకు ఇదొక గొప్ప వరం అవుతుంది అనటంలో సందేహం లేదు. ఈ మహత్తర మంత్రాలను, సంబంధిత విధి విధానాలను ఆసక్తిగలవారు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచితంగా నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు.
విజయదశమికి ఈ పుస్తకావిష్కరణ శ్రీ విద్యా ఆలయం అమ్మవారి సన్నిధిలో జరగడం, మొదటి పుస్తకం దేవికి సమర్పించడం చాలా సంతోషకరమైన విషయమని, ఇందుకు కృషి చేసిన తన కార్యవర్గ సభ్యులందరికీ అయన అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime news |సిమెంట్ లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
నవయాదాద్రి ఆలయ గోపురాల ప్రత్యేకత
ప్రాణం పోయినా దళిత బంధును వదలం : సీఎం కేసీఆర్