లండన్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మేలు జరిగిందన్నారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు ఆయన కోరారు.
ఇటీవల ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించారని, ఎక్కడికక్కడ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారన్నారు.
సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ‘నాటా’ రూ.5 లక్షల విరాళం