న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర రూ.97 తగ్గి రూ.47,853కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం పసిడి ధర 47,950 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో యెల్లో మెటల్ ధర స్థిరంగా ఉండటమే దేశంలో పసిడి ధర స్థిరంగా ఉండటానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
కాగా, వెండి ధరలు కూడా ఇవాళ తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,417 తగ్గి రూ.71,815కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.73,232 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,867 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 27.88 అమెరికన్ డాలర్లు పలికింది.