విద్యార్థికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ భరోసా
వైద్యం కోసం రూ. లక్ష సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేత
కోటపల్లి, జూన్ 30 : రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన విద్యార్థినికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అండగా నిలిచారు. నాడు వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.లక్ష ఎల్వోసీ మంజూరు చేయగా, నేడు అదే విద్యార్థినికి కృత్రిమ కాలును ఏర్పాటు చేసేందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి మరో రూ.లక్ష ఎల్వోసీని బుధవారం అందజేశారు. కాసిపేట మండలం ధర్మరావుపేటలోని లంబడీతండాకు చెందిన లౌడ్య దివ్య విద్యార్థిని 2020 డిసెంబర్ 31 న జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్సీ రూ.లక్ష మం జూరు చేయించి సకాలంలో వైద్యం అందేలా కృషి చేశారు. ఇప్పుడు అదే విద్యార్థినికి కృత్రిమ కాలు ఏర్పాటుకు రూ.3 లక్షల వరకు ఖర్చు కానుండగా, మరో రూ.లక్ష మంజూరు చేసి ఎల్వోసీని కుటుంబసభ్యులకు అందచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్సీకి విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతులు తెలిపారు.