హైదరాబాద్ : రాష్ర్టంలోని జిల్లాల అటవీశాఖ అధికారులతో పీసీసీఎఫ్ శోభ సమావేశం అయ్యారు. అటవీ భూముల రక్షణ, అన్యాక్రాంతమైన భూముల స్వాధీనంపై చర్చించారు. అటవీ భూముల రక్షణపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అటవీ భూముల ఆక్రమణ యత్నాలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పెట్రోలింగ్ ద్వారా ఆక్రమణలు నివారించొచ్చు అని తెలిపారు.
అటవీ నేరాల్లో అధికారులు, సిబ్బంది పాత్రపై ఆరోపణలు ఉన్నాయని శోభ తెలిపారు. విచారణ జరిపి, నిజనిజాలు నిగ్గుతేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమణలకు గురైన భూముల స్వాధీనానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించొద్దు అని ఆదేశించారు. అడవులు ప్రాధాన్యతపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. గూగుల్ టైమ్ లైన్ మ్యాపుల ద్వారా మార్పులు గమనించాలి. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.