బోధన్, జూన్ 16: ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరటానికి నిర్వహించిన ఎంసీహెచ్ ఎంట్రన్స్లో తెలంగాణ డాక్టర్ చిగురుపాటి వేదసంహిత ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన ఆమెకు ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఒకటైన ట్రామాసర్జరీ కోర్సులో ఈ ర్యాంకు దక్కింది. ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రామాసర్జరీ కోర్సును ఆమె అభ్యసించనున్నారు. ప్రణాళికబద్ధంగా చదవటం వల్లే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఆమె తెలిపారు.