హైదరాబాద్ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లో మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ, కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.