తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సింగపూర్లోని సంబవాంగ్ పార్క్లో అక్టోబర్ 1న ఈ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 3000 నుండి 4000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారితోపాటు స్థానికులకు కూడా బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు గత 13 సంవత్సరాలుగా ఈ పండుగను వేడుకలా జరుపుకోవడం ద్వారా చరిత్రలో టీసీఎస్ఎస్ నిలిచిపోతుందని సొసైటీ సభ్యులు అన్నారు.
ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ఫర్నిచర్ వరల్డ్ వారు బహుమతులు అందజేశారు. ఈ యేడు బతుకమ్మ సంబురాలకు సమన్వయ కర్తలుగా గడప రమేశ్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, రజిత రెడ్డి, నిర్మల రెడ్డి, అనుపురం శ్రీనివాస్ నంగునూరి సౌజణ్య మరియు పద్మజ నాయుడు తదితరులు వ్యవహరించారు. ఈ సారి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా టీసీఎస్ఎస్ ఏర్పాటు చేసిన ‘సింగపూర్ బతుకమ్మ – సింగారాల బతుకమ్మ’ నిలిచింది. ఈ పాటను టీసీఎస్ఎస్ సభ్యుడు కాసర్ల శ్రీనివాస రావు రచించగా.. శ్రావ్య అత్తిలి శ్రావ్యంగా ఆలపించారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల, రవి కృష్ణ విజాపూర్. ఇతర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సభ్యులకు, సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న దాతలకు, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సంబురాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మహిళలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.