యూఎన్హెచ్చార్సీకి భారత్ స్పష్టం
న్యూఢిల్లీ, జూన్ 20: సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ వ్యక్తులకు సాధికారిత కల్పించేందుకే కొత్త ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టామని భారత్ స్పష్టం చేసింది. వాటిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్హెచ్చార్సీ) వ్యక్తం చేసిన ఆందోళనలను తోసిపుచ్చుతూ బదులిచ్చింది. విస్తృత సంప్రదింపుల తర్వాతే కొత్త ఐటీ రూల్స్ను ఖరారు చేశామని పేర్కొంది. భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించిందని, భారత ప్రజాస్వామిక నిర్మాణంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన మీడియా భాగమని తెలిపింది.