మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే19: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వ కృషికి ప్రైవేట్ సంస్థల తోడ్పాటు ఎంతో అవసరమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటి సమంత.. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, ఎంఎస్ఎం ల్యాబొరేటరీ ద్వారా 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వాటిని శ్రీనివాస్గౌడ్ బుధవారం దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బందికి అప్పగించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అత్యవసర సమయాల్లో కొవిడ్ రోగులకు ఉపయోగపడుతాయని చెప్పారు. వీటిని దేవరకద్ర, రాజపూర్, సీసీకుంట తదితర చోట్ల ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాలకు కేటాయించనున్నట్టు తెలిపారు. కరోనా వేళ భార్యా, బిడ్డలను వదిలి 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.