జడ్చర్లటౌన్, ఏప్రిల్27: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థులు గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 27వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ ఊరేగింపులతో బయలుదేరి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ 18వ వార్డులో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బాలానగర్ జెడ్పీటీసీ కళ్యాణి వార్డుల్లో తిరిగి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఫేహిమినాజ్ అంభాభవానీ ఆలయం, పోటుగడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు వివరించారు.
2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బుక్క మహేశ్ గుల్షన్నగర్, ఆదర్శనగర్కాలనీ, ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ కరప్రతాలు అందించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్ గౌరీశంకర్ కాలనీ, సత్యనారాయణ టెంపుల్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓటర్లకు అభివాదం చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
4వ వార్డులో అభ్యర్థి దేవా మాధవరావు కంపౌండ్, వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
5వ వార్డులో అభ్యర్థి కుమ్మరి నవనీత నాగసాల, నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ప్రచారం చేశారు.
6 వార్డులో అభ్యర్థి సుంకసారి రమేశ్ హరిజనవాడ, జవహార్నగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య ఓటర్లను కోరారు.
7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి బూరెడ్డిపల్లి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు.
8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దోరెపల్లి లక్ష్మీ హౌసింగ్బోర్డుకాలనీ, ప్రశాంత్నగర్లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హౌసింగ్బోర్డుకాలనీ మరింత అభివృద్ధి
చెందుతుందని ఓటర్లకు వివరించారు.
9వ వార్డులో అభ్యర్థి చైతన్య నక్కలబండతండా, శంకరాయపల్లితండాలో ప్రచారం చేశారు.
10వ వార్డులో అభ్యర్థి నడిమింటి రవి కుమ్మరివాడి, బాలాజీనగర్, సంతోశ్నగర్, గాంధీచౌరస్తాలో ప్రచారం చేశారు.
11వ వార్డులో అభ్యర్థి బండమీది జ్యోతి బాబానగర్ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
12వ వార్డులో అభ్యర్థి రఘురాంగౌడ్ శ్రీనివాస్కాలనీలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. బాలానగర్ జెడ్పీటీసీ కల్యాణి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ ఇంటింటికెళ్లి ఓటర్లను కలిశారు.
13వ వార్డులో అభ్యర్థి నందకిషోర్గౌడ్ చైతన్యనగర్కాలనీ, వెటర్నరీ దవాఖాన ప్రాంతంలో జోరుగా ప్రచారం చేశారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు.
14వ వార్డులో కోనేటి పుష్పలత త్రిశూల్నగర్, బక్కారావుకంపౌండ్ ఏరియా, హనుమాన్స్ట్రీట్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
15వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సారిక ప్రచారం చేశారు. గుండప్పకంపౌండ్, ఎల్బీ స్ట్రీట్, కేపీ స్ట్రీట్, భాగ్యలక్ష్మీకాలనీ, రాఘవేంద్ర థియేటర్ ఏరియాలో ప్రచారం చేశారు.
16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి రాంమందిర్, శివాజీనగర్, నటరాజ్ స్ట్రీట్లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య వాల్మీకినగర్, శాంతినగర్, దర్గా ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి తరఫున పాలమూరు బిత్తిరిసత్తి ప్రచారం చేస్తూ హల్చల్ చేశారు.
18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొఖిద్ ఫజల్బండ
అక్బర్ మసీదు, హనుమాన్ టెంపుల్ ఏరియా, మదీనా
మసీదు ప్రాంతంలో ప్రచారం చేశారు. ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు.
19వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సాజిదాసుల్తానా ఎర్రసత్యం కాలనీ, ఫజల్బండ ప్రాంతంలో ప్రచారం చేశారు. అభ్యర్థి తరఫున మిడ్జిల్ మండల టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు.
20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణి మదీనాతులుమ్ పాఠశాల, గంజ్ ఏరియాలో ప్రచారం చేశారు. జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అభ్యర్థి తరఫున ఇంటింటికెళ్లి ప్రచారం చేశారు.
21వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వంగూర్ హరిత పాతబజార్ పీర్లమసీదు, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంతం, సింగిల్విండో కార్యాలయం ప్రాంతంలో ప్రచారం చేశారు.
22వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కావలి శ్రీశైలమ్మ హరిజనవాడ, పాతబజార్ హనుమాన్ దేవాలయం వెనుక ప్రాంతంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున జెడ్పీవైస్చైర్మన్ యాదయ్య ప్రచారం చేశారు.
23వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాశంకర్గౌడ్ మదీనాకాలనీ, వెంకటపతిరావుకాలనీ, హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఏరియాలో ప్రచారం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలతో కాలనీల్లో ఊరేగింపు తీశారు.
24వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్రెడ్డి రంగారావుతోట, పద్మావతీకాలనీ, హుడాకాలనీలో ప్రచారం చేశారు. రాజాపూర్ మండల టీఆర్ఎస్ నాయకుడు అభిమన్యురెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కాలనీల్లో తిరిగి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
25వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి లత లక్ష్మీనగర్కాలనీ, ఇందిరానగర్, వికాస్నగర్, జకీ నగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
26వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆలూరి శశికిరణ్ వెంకటేశ్వరకాలనీ, సయ్యద్వాడీ ప్రాంతంలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
27వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్మడియాదయ్య గాంధీనగర్, ఇందిరానగర్ కాలనీలో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కరపత్రాలను ఓటర్లకు ఇస్తూ ప్రచారం చేశారు.