న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోమారు షేర్ల బైబ్యాక్కు వెళ్లనున్నది. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన జరిగే ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆదివారం తెలిపింది
సెబీ (బై బ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్) నిబంధనలు-2018కి అనుగుణంగా షేర్ల బై బ్యాక్కు వెళ్లనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఫుల్లీ పెయిడ్ప్ ఈక్విటీ షేర్ల బై బ్యాక్కు వెళతామని పేర్కొంటూ గత నెల 15న రెగ్యులేటరీ సంస్థలకు నోటీసు ఇచ్చినట్లు తెలిపింది.
అలాగే, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఫలితాలను కూడా ఏప్రిల్ 14వ తేదీనే వెల్లడిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. గతవారం ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,625.36 కోట్లు పెరిగి రూ.6,13,854.71 కోట్లకు చేరింది.
విప్రోతోపాటు ఇతర ఐటీ దిగ్గజాల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. గతవారం ఇన్ఫోసిస్ షేర్లు 0.066 శాతం పెరిగి రూ.1,440.75వద్ద స్థిరపడ్డాయి. గత ఏడాది కాలంలో 141 శాతానికి పైగా ఇన్ఫీ షేర్లు బలోపేతం కావడంతో రూ.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన నాలుగో ఇండియన్ ఐటీ సంస్థగా నిలిచింది.
బీఎస్ఈలో ఇన్ఫోసిస్ స్టాక్ అల్టైం రికార్డును చేరుకుని రూ.1,425కు చేరడంతో దాని ఎం-క్యాప్ రూ.6.05 లక్షల కోట్లను తాకింది. ఈ ఏడాది ఇన్ఫీ షేర్ 12 శాతానికి పైగా బలపడింది.