న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్ఐసీతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖలో మొత్తం 155 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవలని సూచించింది. ఇందులో అసిస్టెంట్ కీపర్, డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 155
ఇందులో డిప్యూటీ డైరెక్టర్ 151 (కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్ఐసీలో), అసిస్టెంట్ కీపర్ 2 (ఆంత్రపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), ఫిషరీష్ రిసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 1 (మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్), ప్రిన్సిపల్ ఆఫీసర్ 1 (మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
వెబ్సైట్: https://www.upsc.gov.in/