హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300కు పైగా ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 347
ఇందులో సీనియర్ మేనేజర్ (రిస్క్) 60, మేనేజర్ విభాగంలో రిస్క్ 60, సివిల్ ఇంజనీర్ 7, ఆర్కిటెక్ట్ 7, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 2, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్ 1, ఫారెక్స్ 50, సీఏ 14, అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో.. టెక్నికల్ ఆఫీసర్ 26, ఫారెక్స్ 120 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. అయితే డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం తప్పనిసరి. సీనియర్ మేనేజర్కు 30-40 ఏండ్లు, మేనేజర్కు 25-35 ఏండ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 3
వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/