న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES)లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 12 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది.
మొత్తం పోస్టులు: 20
ఇందులో చీఫ్ రెసిడెంట్ ఇంజినీర్ 10, అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజినీర్ 10 చొప్పను ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, డిప్లొమాలో ఏదో ఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. క్వాలిఫికేషన్, అనుభవాన్ని అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 12
వెబ్సైట్: rites.com