న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 492 అప్రెంటిస్లను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారికి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో శిక్షణ అందిస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం అప్రెంటిస్లు: 492
ఇందులో ఎలక్ట్రిషన్ 112, మెషినిస్ట్ 56, వెల్డర్ 88, ఫిట్టర్ 200, టర్నర్ 20, పెయింటర్ 12, ఏసీ మెకానిక్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: apprenticeshipindia.org