న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ నెల 27 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 137 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్వైజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను రెండ్ల కాలపరిమితికిగాను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు: 137
ఇందులో ఫీల్డ్ ఇంజినీర్ 655 (ఎలక్ట్రికల్ 48, సివిల్ 17), ఫీల్డ్ సూపర్వైజర్ 77(ఎలక్ట్రికల్ 50, సివిల్ 22) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థులు 29 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.400, మిగిలిన పోస్టులకు రూ.300, ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 27
వెబ్సైట్: http://www.powergrid.in