హైదరాబాద్: నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఐటీఐ అప్రెంటిస్షిప్ అందిస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 16 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 243 సీట్లను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ అందిస్తుంది. ఇందులో పెయింటర్, వెల్డర్, ప్లంబర్ వంటి ట్రేడ్లు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 243
ఇందులో ఎలక్ట్రిషన్ 30, ఎలక్ట్రానిక్ మెకానిక్ 70, ఫిట్టర్ 65, ఆర్ అండ్ ఏసీ 7, ఎంఎంవీ 1, టర్నర్ 10, మెషినిస్ట్ 5, మెసినిస్ట్ (జీ) 3, ఎంఎం టూల్ మెయిన్ 2, కార్పెంటర్ 5, కోపా 16, డీజిల్ మెకానిక్ 5, ప్లంబర్ 2, ఎస్ఎండబ్ల్యూ 2, వెల్డర్ 15, పెయింటర్ 5 చొప్పున స్థానాలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాసై ఎన్సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 2021, అక్టోబర్ 14 నాటికి 18 ఏండ్లు నిండినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 16
సర్టిఫికెట్ వెరిఫికేషన్: సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు
అప్రెంటిస్షిప్ ప్రారంభం: అక్టోబర్ 15
వెబ్సైట్: www.ecil.co.in