న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్డ్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)లో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఖాళీలు మైనింగ్, మైన్ సర్వేయింగ్ విభాగాల్లో ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 450
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మైనింగ్ 140, టెక్నీషియన్ అప్రెంటీసెస్ మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్ 310 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: మైనింగ్ ఇంజినీరింగ్ లేదా మైన్ సర్వేయింగ్లో డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏండ్లు నిండి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీ, డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు.
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 5
వెబ్సైట్: www.mhrdnats.gov.in