నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన దేవల భూదేవ్వ (48) రోజు మాదిరేగానే శనివారం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోయే సరికి కుమారుడు వెళ్లి చూడగా బోరు వావి వద్ద మృతదేహం కనిపించింది. కరెంట్ మోటర్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.