ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాలు అన్నారు. శుక్రవారం ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామంలో, మున్సిపల్లోని మున్సిపల్ 22వ వార్డులో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా కేంద్రాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వైద్యశాఖ సిబ్బందికి సూచించారు.
ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో, ఆర్మూర్ మున్సిపల్లోని అన్ని వార్డుల్లో టీకా కేంద్రాలను సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, కౌన్సిలర్లు పరిశీలించి వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్మూర్లో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ తనిఖీ చేసి వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో దేగాం వైద్యాధికారి భాస్కర్రావు, వైద్యులు స్వాతి వినూత్న, ప్రవీణ, అమృత్రాంరెడ్డి, ఆర్మూర్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఆరోగ్య సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, ఆనవాల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.