నిజామాబాద్/హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల హృదయాల నుంచి దూరం వెళ్లిన బీజేపీని ఎవరూ నమ్మరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రైతురక్షణ కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూ పొందిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు రాబందు చట్టాలు తెచ్చిందని మండిపడ్డారు. ఆడబిడ్డలకు రక్షణగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడితే, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ఆడబిడ్డలపై భారం మోపిన బీజేపీని ఎవ రూ నమ్మరని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తంచేశారు. గురువారం నిజామాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదన్నారు. రెఫరెండం అని ఎవరు పడితే వారు అంటే కుదరదని చెప్పారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే రెఫరెండమని స్పష్టంచేశారు. వచ్చే సాధారణ ఎన్నికలే రెఫరెండం అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపును బీజేపీ రెఫరెండంగా తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో నాగార్జునసాగర్ ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు. టీఆర్ఎస్లో పుట్టి, పెరిగి తిరిగి అదే పార్టీని శాపనార్థాలు పెట్టిన వాళ్లెవరూ ఇప్పటివరకు బాగుపడలేదని స్పష్టంచేశారు. పార్టీ నుంచి ఈటల ఎందుకు బయటకు వెళ్లారో చెప్పడంలేదన్నారు. బీజేపీ ప్రధాన పోటీదారు అని తాము అనుకోవడం లేదని, అది మునిగిపోయే పార్టీ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఓ వజ్రాయుధం
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఓ వజ్రాయుధం అని కవిత పేర్కొన్నారు. తెలంగాణను శాశ్వతంగా ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో సీఎం నిమగ్నమయ్యారని చెప్పారు. జీడీపీలో తెలంగాణ 4వ స్థానంలో నిలువడం సాధారణ విషయం కాదన్నారు. ఆడబిడ్డల రక్షణకు ప్రభుత్వం షీ టీమ్స్ పెడితే అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. వరంగల్లో తలపెట్టిన విజయ గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జాజాల సురేందర్ చొరవతో ైక్లెవల్ కార్డోమా వ్యాధితో బాధపడుతున్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కంచర్ల అఖిలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. గురువారం ఆ చెక్కును నిజామాబాద్లో బాధితురాలికి అందజేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.