నవీపేట : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉండి ఆపదలో ఆదుకుంటుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.రాంకిషన్రావు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నవీపేట మండలం లోని టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది పార్టీలో బీమా ప్రీమియం చెల్లించారని గుర్తు చేశారు. పోలీస్ పంచనామా ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి బీమా డబ్బులు అందే విధంగా తనవంతు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకు వెళ్లి డబుల్ బెడ్రూం మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రమాదంలో గాయపడిన బాధితులకు రాంకిషన్రావు తన వంతుగా ఆర్థిక సహాయం అందచేశారు. ఎంపీపీ సంగెం శ్రీనివాస్, నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ కూడా మృతుడు లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. టీఆర్ఎస్ మండల ఇన్చార్జి నర్సింగ్రావు, వైస్ ఎంపీపీ హరీశ్, సీనియర్ నాయకులు నీరడి బుచ్చన్న, తెడ్డు పోశెట్టి, న్యాలకంటి అబ్బన్న, మువ్వ నాగేశ్వర్రావు, దొంత ప్రవీణ్కుమార్, బి. సూరిబాబు, రాజు, మేకల రాజేశ్వర్,ఈర్నాల స్వామి, జియోద్దీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.