వేల్పూర్: ఇంజినీర్స్ డే సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని అధికార నివాసంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్,శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్వయాన సివిల్ ఇంజినీర్ కావడంతో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు ఆయనను సన్మానించారు.
కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్కు చెందిన మండలాల కన్వీనర్లు నాగధర్, ఏలియా, పూర్ణానందం, ప్రవీణ్రెడ్డి, దేవేందర్, మల్లెల లక్ష్మణ్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, అమీనాపూర్ సర్పంచ్ రాజేశ్వర్ , పుప్పాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.