నిజామాబాద్ : స్నేహితుల దినోత్సవం రోజు నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. సాయంత్రం ఐదుగురు స్నేహితులు ప్రాజెక్టులో స్నానం చేసేందుకు దిగారు. వీరంతా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతుండగా గుర్తించిన స్థానికులు అతికష్టం మీద ఇద్దరిని కాపాడారు. రాహుల్, ఉదయ్, శివ అనే ముగ్గురు యువకులు నీటమునిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.