బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న రావణ దహన కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణంలో విద్యుత్ బగ్గిలో పర్యటించారు.
పలు చోట్ల వాహనాన్నిఆపి కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ ఏఈ యుగేంధర్తో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ , జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి , ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ , వైస్ చైర్మన్ షేక్ జుబేర్ , నాయకులు దొడంల వెంకట్రామ్ రెడ్డి , మహ్మద్ ఎజాస్, అలీమొద్దీన్బాబా , కౌన్సిలర్లు హకీం, లింగమేశ్వర్ , రమాదేవి , నార్ల నందకిశోర్ తదితరులు ఉన్నారు.