నిజామాబాద్ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఎంతో మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రుద్రూర్ ఎంపీపీ సుజాత, జెడ్పీటీసీ నారోజి గంగారాం, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.