నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిదుగురు ఉపాధ్యాయులను శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులకు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు విద్య లేక పోతే విలువ లేదు. ఆ విలువను అందిస్తున్న ఉపాధ్యాయులు గొప్పవారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలలో రూ. 17 కోట్లతో 170 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులను మంజూరు చేశామన్నారు.
రూ. 9 కోట్లతో 100 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. మలిక వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. వాటిని ఉపయోగించి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని సూచించారు. విద్యార్థులు ఉన్నతులుగ తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.