డిచ్పల్లి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నియమితులైన నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్గా నియమించబడిన బాజిరెడ్డి గోవర్ధన్ను కవిత శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సీనియర్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ను ఆర్టీసీ చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలని బాజిరెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ మోహన్, యువనాయకులు బాజిరెడ్డి అజయ్ తదితరులు ఉన్నారు.