నవీపేట, మార్చి 29:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో నిజామాబాద్ జిల్లాలోని నవీపేట గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. గ్రామం మధ్యలో నుంచి బాసర రోడ్డు పనులు పూర్తి కావడంతో గ్రామం సుందరంగా మారింది. 25 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.50 కోట్ల నిధులతో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులన్నీ పూర్తి చేసుకున్నది. గతంలో గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్చేది. ప్రస్తుతం ఏ వీధి చూసినా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. ప్రతి రోజూ చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు పనులు పూర్తయ్యాయి. దశాబ్దాలుగా నవీపేటలో శ్మశాన వాటిక లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నవీపేట జనాభా 10వేలకు పైగా ఉండడంతో మరో వైకుంఠధామాన్ని ప్రభుత్వం మంజూ రు చేసింది. దర్యాపూర్లో పనులు సైతం ప్రారంభమయ్యాయి. మండల కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లకు ఇరు వైపులా మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
అభివృద్ధికి అందరి సహకారం ..
గ్రామ అభివృద్ధికి అధికారులతో పాటు గ్రామస్తులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులతో గ్రామం సుందరంగా ముస్తాబయ్యింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి.
-సందీప్, కార్యదర్శి, నవీపేట
స్వల్పకాలంలోనే పనులన్నీ పూర్తి ..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే షకీల్ సహకారంతో జిల్లాలోనే నవీపేట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం. పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే మూల మలుపు నుంచి టీటీడీ దేవస్థానం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. 25 నెలల వ్యవధిలోనే రూ.2.50 కోట్లతో పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం.
-ఏటీఎస్ శ్రీనివాస్, సర్పంచ్, నవీపేట
ఇవీ కూడా చదవండి..
భార్య ప్రతిష్టకు భంగం.. భర్త అరెస్ట్
కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకున్నాఅభివృద్ధి చేశాం