మాక్లూర్, మార్చి 29 : మండల కేంద్రంలోని సబ్స్టేషన్ నుంచి గతంలో కొనసాగిన విద్యుత్ సరఫరాను తలచుకుంటేనే బొంకన్పల్లి ముల్లంగి(బీ) గ్రామస్తులు హడలెత్తిపోతారు. బ్రేక్ డౌన్లు, లో వోల్టేజీ సమస్యతో తా ము ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావని అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజ ల, రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రభుత్వం బొంకన్పల్లి-ముల్లంగి(బీ) గ్రామాల మధ్య రూ.కోటి నిధులతో 33/11 కేవీ సబ్స్టేషన్ను నిర్మించింది.
దశాబ్ద కాలంగా ఎదురుచూపులు..
తమ గ్రామాలకు విద్యుత్సమస్య పరిష్కారంకావాలంటే సబ్స్టేషన్ ఏర్పాటు ఒక్కటే మార్గమ ని ప్రజలు, రైతులు దశాబ్దకాలంగా ఎదురు చూశా రు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత 24గంటలపాటు విద్యుత్ సరఫరాపై దృష్టిసారించిన ప్రభు త్వం నూతన సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా బొంకన్పల్లి-ముల్లంగి(బీ) గ్రామాల మధ్య రూ.కోటి వ్యయంతో సబ్స్టేషన్ను నిర్మించి ఇబ్బందులను దూరంచేయడం తో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
600కుపైగా వ్యవసాయ కనెక్షన్లు
బొంకన్పల్లి, ముల్లంగి(బి) గ్రామాల పరిధిలో 600కుపైగా వ్యవసాయ, 500 ఇండ్ల కనెక్షన్లు ఉన్నాయి. రెండు గ్రామాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు కావడంతో చుట్టూ పక్కల గ్రామాలకు సైతం విద్యుత్ సమస్య దూరమైంది. సరఫరాలో చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తినా.. చిటికెలో సమస్యను పరిష్కరించే వీలుందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లో వోల్టేజీ కారణంగా గతంలో మోటర్లు కాలిపోయేవని, ఆర్థికంగా నష్టపోయేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు.
రైతులకు ఎంతో ఉపయోగకరం
బొంకన్పల్లి-ముల్లంగి(బి) గ్రామాల మధ్య సబ్స్టేషన్ నిర్మాణంతో రైతులకు ఎంతో మేలుజరిగిం ది. ప్రస్తుతం ఎలాం టి సాంకేతిక సమస్యలు తలెత్తడం లేదు. 600కుపైగా మోటర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నది. ఓవర్లోడ్, బ్రేక్డౌన్ సమస్యలు పూర్తిగా దూరమయ్యాయి. గతంలో చిన్నసమస్య ఏర్పడినా మాక్లూర్ సబ్స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చేది.
ఎమ్మెల్యే జీవన్రెడ్డి సహకారంతో..
ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి సహకారంతో 33/11కేవీ సబ్స్టేషన్ను ప్రభుత్వం మంజూరు చేసింది. 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతున్నది. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి రెండు గ్రామాలకు ఇచ్చిన హామీ మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన సబ్స్టేషన్ను నిర్మించారు.
ఇవీ కూడా చదవండి..
తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!