వేల్పూర్, మే 27 : మండలంలోని జాన్కంపేట్ గ్రామ సమీపంలో ఉన్న నిజాంసాగర్ కెనాల్ను మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం పరిశీలించారు. కొంతకాలం నుంచి గుత్ప లిఫ్ట్ ద్వారా తమ గ్రామానికి నీరు రావడం లేదని ఇటీవల రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిజాంసాగర్ కెనాల్ ద్వారా నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి వెంట సర్పంచ్ సౌడ రమేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, ఎంపీటీసీ చందన్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, పచ్చల నడ్కుడ సొసైటీ చైర్మన్ రాజన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, నాయకులు సామ మహిపాల్, నల్ల రమేశ్ తదితరులు ఉన్నారు.
నీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలి..
కమ్మర్పల్లి, మే 27: మండలంలోని బషీరాబాద్ కాడి చెరువు ఎత్తిపోతల డిస్ట్రిబ్యూటరీ కెనాల్ను మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ కెనాల్ నుంచి నీటి సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాలువను పరిశీలించిన ఆయన నీటి సరఫరాలో ఇబ్బందులను తొలగించాలని సూచించారు. బషీరాబాద్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి కొవిడ్ పరిస్థితులను తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి విషయమై సమీక్షించారు. ఆర్డీవో శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ భానుప్రకాశ్, తహసీల్దార్ బావయ్య, సర్పంచ్ సక్కారం అశోక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఏఎంసీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, నాయకులు బద్దం చిన్నారెడ్డి, పెరుమాండ్ల రాజాగౌడ్, బోడ దేవేందర్, ఏనుగు గంగారెడ్డి, బైకాన్ మహేశ్, లోలపు సుమన్, రామన్నపేట్ మోహన్రెడ్డి, ఏఈ ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.