ఎడపల్లి (శక్కర్నగర్)/ఆర్మూర్ /మాక్లూర్/ నవీపేట/ మోర్తాడ్/ధర్పల్లి/రుద్రూర్, మే 24: ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించాలని, అనవసరంగా రోడ్లపైకి రావొద్దని బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్ సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సై ఎల్లాగౌడ్, సిబ్బందితో కలిసి సోమవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రాజు, సిబ్బంది నాగబోయి, సంతోష్, రాకేశ్, మహిపాల్, సుధీర్, శ్రీను తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచ్ కల్లెం మోహన్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యవసరమైతేనే ప్రజలకు బయటికి రావాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, ఎంపీటీసీ మార్కంటి లక్ష్మి, సొసైటీ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, రైతుబంధు సమితి డైరెక్టర్ మూలాకిడి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మార్కంటి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలో లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. నవీపేట మండలంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నది. ఎస్సై యాకూబ్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మాస్కులు లేకుం డా రోడ్లపైకి వచ్చిన యువకులకు జరిమానా విధిస్తున్నారు. కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. మోర్తాడ్ మండలంలో లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మోర్తాడ్ ఎస్సై సురేశ్ రోడ్లపైకి వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ప్రతిఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారి బారిన పడకుండా చూసుకోవాలని ధర్పల్లి తహసీల్దార్ జయంత్రెడ్డి అన్నారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించేలా అధికారులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ధర్పల్లి మండలంలో ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రుద్రూర్లో పకడ్బందీగా అమలవుతున్నది. దీంతో ఉదయం పది దాటిన తర్వాత జనసంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.