ఇందూరు, జూన్ 23: రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేసిన పెట్టుబడి సహాయాన్ని ఇతర బకాయిలకింద తీసుకోవద్దని బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని కలెక్టర్, చైర్మన్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షి క రుణ లక్ష్యాన్ని రూ.7369.32 కోట్లుగా కమిటీ ఆమో దం తెలిపింది. పంట రుణాలు రూ.3,550 కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం రుణ లక్ష్యం 90శాతం దాటాలని అన్నారు. వ్యవసాయాధారిత జిల్లా అయినందున రైతులను ప్రోత్సహించాలని, వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు రుణాలను అందజేయాలని సూ చించారు. ధాన్యం విక్రయించే సమయంలో కడ్తా పేరుతో రైతులు నష్టపోకుండా ప్యాడీ క్లీనింగ్ యంత్రాలను రైతులకు ఇప్పించాలని అన్నారు. మహిళా సంఘాలకు రుణ పరిమితిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్లాలని సూచించారు. ఐకేపీ ద్వారా అందిస్తున్న రుణాలు ఈ ఏడాది సుమారు రెండింతలు కావడం ప్రశంసనీయమన్నారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బ్యాంకర్లు బాగా పనిచేశారని కలెక్టర్ అభినందించారు. వ్యవసాయం అనుబంధ సంక్షే మ రంగాలకు ఉదారంగా రుణాలను అందించాలన్నారు. రుణాలు పొందినవారితోపాటు బ్యాంకులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.
యాసంగిలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
యాసంగిలో 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 72 బాయిల్డ్ రైస్మిల్లుల్లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ అయ్యిందన్నారు. మరో 40శాతం ధాన్యం మిల్లింగ్కు అవసరమైన రైస్మిల్లుల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. బ్యాంకర్లు ఆ దిశగా ఆలోచించి రైస్మిల్లుల ఏర్పాటుకు ముందుకువచ్చే వారికి రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు.సమావేశంలో ఎల్డీఎం శ్రీనివాస్రావు, నాబార్డు డీడీఎం నగేశ్, ఎస్బీఐ ఆర్ఎం పల్లంరాజు, యూబీఐ ఆర్ఎం కృష్ణ, టీజీబీ ఆర్ఎం నారాయణ, ఆర్సెటీ డైరెక్టర్ సుధీంద్రబాబు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిం తదు, మెప్మా పీడీ రాములు, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, జిల్లా పరిశ్రమల కేంద్రం డీడీ బాబురావు, సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.