డిచ్పల్లి, జూన్ 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండలంలోని దూస్గాం గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఎండోమెంట్ సహకారంతో నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలో లక్షా 20 వేల ఎకరాల భూమిలో రైతులు పంటలు పండిస్తున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మంచిప్ప రిజర్వాయర్ ద్వారా ప్రతి మూడెకరాలకు పైపులైన్ ద్వారా నీళ్లు అందించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పా రు. రైతులు తమ భూములు కోల్పోకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీతో పైపులైన్ వేయిస్తున్నట్లు వివరించారు. రానున్న కాలంలో లక్షా 20వేల ఎకరాలు పంట సాగుతో సస్యశ్యామలం కానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, మోహన్రెడ్డి, రాజలింగం, చిన్నబాలయ్య, చిన్నసాయిలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
మండలంలోని ముల్లంగి గ్రామసర్పంచ్ మధుసూదన్రెడ్డిని బుధవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. మధుసూదన్రెడ్డికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఈ మేరకు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్రెడ్డి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, సీనియర్ నాయకులు లక్ష్మీనర్సయ్య, పద్మారావు, ఎంపీటీసీ నర్సయ్య తదితరులున్నారు.
ఖానాపూర్లో..
నిజామాబాద్ రూరల్, జూన్ 23 : రూరల్ మండలంలోని ఖానాపూర్కు చెందిన రేషన్ డీలర్ కొర్వ శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కె సంతోష్, నాయకులు ప్రేమ్దాస్నాయక్, బొల్లెంక గంగారెడ్డి, సాలూగారి మోహన్, గుండారం సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్ తదితరులున్నారు.