డిచ్పల్లి, జూన్ 17: టీయూ వీసీ డి.రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్తో కలిసి గురువారం బిజినెస్ మేనేజ్మెంట్, న్యాయశాస్త్ర విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధ్యాపకులందరినీ పరిచయం చేసుకున్నారు. న్యాయశాస్త్ర విభాగాన్ని సందర్శించిన వీసీని నాక్ విజిట్ బృందం మూక్ కోర్ట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని, న్యాయదేవత విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ రాజేశ్వరి, ఆచార్య కైసర్, డాక్టర్ అపర్ణ, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ వాణి, కిరణ్ రాథోడ్, బీకోజి, మమత, లా విభాగాధిపతి డాక్టర్ ప్రసన్నరాణి, డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా, డాక్టర్ స్రవంతి, డాక్టర్ నాగరాజు, యెండల ప్రదీప్, బాలరాజు, అలీ తదితరులు ఉన్నారు.
వీసీకి పలువురి సన్మానం..
టీయూ వైస్ చాన్స్లర్ రవీందర్గుప్తాను తెలంగాణ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వీసీకి శాలువా, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్, సంఘం బాధ్యులు లాల్సింగ్, వరద భట్టు, వేణురాజ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. వీసీ రవీందర్ గుప్తాను నగర ఆర్యవైశ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. వీసీని కలిసిన వారిలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి, మాణిక్భవన్ స్కూల్ అధ్యక్షుడు మోటూరి మురళీగుప్తా, కార్యదర్శి రావులపల్లి జగదీశ్వర్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యదర్శి విజయ్కుమార్ గుప్తా, ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుర శ్రీనివాస్ గుప్తా, వాసవి క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ గాలి నాగరాజు గుప్తా, నగరేశ్వర మందిర్ అధ్యక్షుడు పెద్ది సాయిబాబా గుప్తా, గోల్హనుమాన్ ఆలయ అధ్యక్షుడు బి.రాజేంద్రగుప్తా, ఆర్యవైశ్య సంఘం డిచ్పల్లి అధ్యక్షుడు రామ్లక్ష్మణ్ గుప్తా, టీయూ అకాడమిక్ కన్సల్టెంట్స్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ పురుషోత్తం తదితరులు ఉన్నారు.
టీయూ వీసీని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(నిజామాబాద్, ఆదిలాబాద్) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మన్యం శ్రీనివాస్, టీయూ ఎస్బీఐ మేనేజర్ పవన్ ప్రసన్న కుమార్ సన్మానించారు. ఆచార్య నసీం, ఏఈ వినోద్కుమార్, ఏఆర్ సాయాగౌడ్, సూపరింటెండెంట్ భాస్కర్, ఈడీపీ సెక్షన్ అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ అతీఖ్ సుల్తాన్ ఘోరీ, పీఆర్వో డాక్టర్ త్రివేణి పాల్గొని.. టీయూ ఎస్బీఐ లావాదేవీల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఏజీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఎస్బీఐ సిబ్బంది నాగేశ్వర్రావు, సాగర్బాబు, రమాదేవి తదితరులు ఉన్నారు.