ఖలీల్వాడి/కమ్మర్పల్లి/ముప్కాల్, జూన్ 16 : ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతోమంది నిరుపేదలకు వరంలా మారిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొంది సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న 43 మందికి రూ.60,53,000 చెక్కులను ఇచ్చారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాను క్యాంపు కార్యాలయంలో టీయూ వీసీ రవీందర్గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ముప్కాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ముప్కాల్లో ఇద్దరికి, రెంజర్లలో ముగ్గురికి, వేంపల్లిలో ఇద్దరికి, నాగంపేట్లో ఇద్దరికి, కొత్తపల్లిలో ముగ్గురికి, నల్లూర్లో నలుగురికి ఆర్థిక సహాయం మంజూరైందని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ, జడ్పీటీసీ బద్దం నర్సవ్వ, నాయకులు సామ వెంకట్రెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లికి చెందిన శ్రీపాద లక్ష్మణ్కు రూ.40వేలు, కైరి శంకర్గౌడ్కు రూ.70వేలు, వేముల వెంకవ్వకు రూ.31వేల చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. వీటిని సర్పంచ్ గడ్డం స్వామి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు హల్దె శ్రీనివాస్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగారాం, సుభాష్గౌడ్, అజ్మత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.