-డిచ్పల్లి, మే 16 :రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారినే అన్ని రకాల వైరస్లు, జబ్బులు అంటుకుంటాయి. వైరస్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఒక్కటే కరోనా. ఇది మానవాళినే గడగడలాడిస్తున్నది. ప్రస్తుతం కరోనా వైరస్తోపాటు డెంగీ కూడా ప్రజలపై దాడి చేసే అవకాశం ఉంది. రెండింటిలోనూ జ్వరం ప్రధాన లక్షణం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి కూడా. పరిసరాల శుభ్రత, దోమల నివారణతో డెంగీ రాకుండా ఉండొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. నేడు జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఏడెస్ ఈజిప్టి అనే జాతి దోమకాటుతో మనిషి శరీరంలోకి ప్రవేశించే వైరస్తో డెంగీ వస్తుంది. ఈ దోమకాటుతోనే ఒకరి నుంచి మరొకరికి డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా వానకాలంలో అధికంగా ఉంటుంది. రాత్రిపూట కాకుండా సూర్యోదయ, సూర్యాస్తమయాల్లోనే కుట్టడం ఈ జాతి దోమ ప్రత్యేకత. సీజనల్ జ్వరం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దోమలను నివారించడంతోనే కట్టడి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
డెంగీ లక్షణాలు..
సమాజపరంగా జాగ్రత్తలు..