నిజామాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు బోర్డు ఏర్పాటు ఇందూరు రైతుల చిరకాల వాంఛ. రెండున్నర దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం నిజామాబాద్ జిల్లా రైతులు ఉద్యమిస్తున్నారు. గతంలో కాంగ్రెస్, తర్వాత బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండి మాయమాటలతో రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్సభ సెగ్మెంటులో బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు తథ్యమని ప్రకటనలు చేశారు. ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచారంలో ఒకడుగు ముందుకేసి తాను గెలిస్తే ఏకంగా ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. పైగా రైతులనుద్దేశించి బాండ్ పేపర్ సైతం రాయించి ఇచ్చాడు. తీరా గెలిచిన తర్వాత ఏడాదిన్నరగా దాని ఊసే లేదు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన అర్వింద్తో సహా బీజేపీ పెద్దలెవ్వరూ పసుపు బోర్డు అంశాన్ని కనీసం లేవనెత్తడం లేదు.
పైగా కేంద్రప్రభుత్వం పార్లమెంట్సాక్షిగా పసుపు బోర్డు అంశమే తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది. ఇదేందని అటు కేంద్రాన్ని ప్రశ్నించక, ఇటు రైతులకు సమాధానం చెప్పలేక అర్వింద్ మొ ఖం చాటేస్తున్నారు. అర్వింద్కు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో పసుపు రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ మరో కొత్త ఎత్తుగడకు పూనుకుంది. ఫేక్ బాండ్పేపర్ను సృష్టించి పసుపు రైతులను గందరగోళంలోకి నెట్టేందుకు యత్నిస్తున్నది. నిండా అబద్ధాలతో కూడిన ఆ పత్రాన్ని సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టింది. ఎంపీ అర్వింద్ కారణంగా పసుపునకు మద్ద తు ధర పదివేల వరకూ దక్కుతున్నదంటూ, 2024 లోనూ ఆయననే తిరిగి గెలిపిస్తామంటూ ఆ బాండ్ పేపర్లో అబద్ధాలను వండివార్చారు. అయితే బీజేపీ ఫేక్ ప్రచారంపై పసుపు రైతులు మండిపడుతున్నారు. పసుపు రైతుల పేరిట తప్పుడు బాండ్ పేపర్ను సృష్టించడం ద్వా రా తన కుటిల బుద్ధిని ఆ పార్టీ బయటపెట్టుకుందని వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
బోర్డు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు..
పసుపు బోర్డు ఇచ్చేది లేదంటూ గత నెలలోనే లోక్సభ, రాజ్యసభలో కేంద్ర మంత్రులు స్వయంగా ప్రకటన చేశా రు. తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానాన్ని కేంద్ర సర్కారు రాతపూర్వకంగా వెల్లడించింది. ఆనాటి నుంచి ఎంపీ అర్వింద్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ ఎంపీ పదవిని దక్కించుకున్న అర్వింద్ను అడుగడుగునా నిలదీయాలని పసుపు రైతుల ఐక్యకార్యాచరణ సమితి ఇప్పటికే నిర్ణయించింది. ఈ పరిస్థితిలో గడ్డు కాలం ఎదురవుతోందని గమనించిన బీజేపీ తాజాగా సోషల్ మీడియాలో మరోమారు తనదైన శైలిలో అసత్య ప్రచారానికి తెర లేపిం ది. ఎంపీ అర్వింద్ కారణంగానే పసుపునకు ధర పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో రైతులందరూ బీజేపీకే మద్దతు తెలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ డాక్యుమెంట్ను సృష్టించారు. బాండ్ పేపర్ మాదిరిగా నకిలీ రాతల తో కూడిన పోస్టును వ్యాప్తి చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన పసుపు రైతుల పేరుతో విడుదలైన ఈ బాండ్ పేపర్ బాగోతాన్ని రైతులే బట్టబయలు చేశారు. రైతుల ముందు నిలబడే దమ్ము లేక ఎంపీ అర్వింద్ తన అనుచరులతో, బీజేపీ కార్యకర్తలతో అబద్ధపు ప్రచారానికి తెగబడ్డారంటూ రైతులు మండిపడుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసే దమ్ము లేక రైతులను పక్కదారి పట్టించేందుకు ఈ కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల పేరుతో రైతులనే మోసగించేలా…
పసుపు రైతుల భావోద్వేగాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తున్నాడు. మొదట్నుంచి తానిచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖంచాటేస్తున్న ఆయన.. ఎలాగైనా పసుపు బోర్డు అంశాన్ని పక్కదారి పట్టించాలనే కుట్రకు దిగుతున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులను ఇందుకోసం బలంగా వాడుకుంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వ్యాప్తి చెందిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో పసుపు బోర్డు అంశంపై లోక్సభలో ఏ ఒక్క రోజు నోరెత్తి మాట్లాడింది లేదని రైతులు చెబుతున్నారు. పైగా కనీస మద్దతు అంశాన్ని సైతం అటకెక్కించారు. దేశంలో పంటలకు కనీస మద్ద తు ధరను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ గందరగోళ ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎంపీ అర్వింద్ ప్రయత్నిస్తున్నారు. రైతులను ప్రతి అంశంలో పావుగా వాడుకునేందుకు ఎంపీ తంటాలు పడుతుంటే నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పసుపు రైతులు మాత్రం అర్వింద్ కుట్రలను భగ్నం చేస్తూ సామాజిక వేదికలపై ఆయన అసలు స్వరూపాన్ని బయటపెడుతూ ఎండగడుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్!
ఒక్కసారి శానిటైజ్.. 35రోజులు రక్షణ