నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 13 : జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతున్నది. వర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శుక్రవారం 30 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి వెంకన్న పేర్కొన్నారు. ఇందల్వాయి పీహెచ్సీలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా తేలిందని డాక్టర్ సుభాకర్ తెలిపారు. మోపాల్లో 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని పీహెచ్సీ వైద్యుడు నవీన్ తెలిపారు. డిచ్పల్లి సీహెచ్సీలో 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. దవాఖానలో 19 మందికి సెకండ్డోస్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. జక్రాన్పల్లి పీహెచ్సీలో 40 పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు.
బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం 26 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా తేలింది. రాకాసీపేట్ పీహెచ్సీలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. పాన్గల్లీ పీహెచ్సీలో 17 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎడపల్లి పీహెచ్సీలో 9 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా తేలినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆర్మూర్లో 23 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, అయేషా ఫిర్దోస్ తెలిపారు.
ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి , హౌసింగ్ బోర్డులోని పీహెచ్సీలో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, మండలంలోని దేగాం పీహెచ్సీలో 23 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, ఆనవాల, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చినట్ల్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 26 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, ఆరుగురికి వ్యాక్సిన్ వేశామని డాక్టర్ రవికుమార్ తెలిపారు.
చౌట్పల్లి పీహెచ్సీలో 30 మందికి టెస్టులు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. వేల్పూర్ మండలంలో 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి అశోక్ తెలిపారు. బోధన్ మండలంలోని సాలూర పీహెచ్సీ పరిధిలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మెడికల్ ఆఫీసర్ రేఖ తెలిపారు. ధర్పల్లిలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రఘువీర్ తెలిపారు. నందిపేట్ పీహెచ్సీలో 32 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిట్ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్ కుమార్ తెలిపారు.