నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే13 : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతు న్నదని తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో గురువారం 46 మందికి కొవిడ్ టెస్ట్లు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. చౌట్పల్లి పీహెచ్సీలో 36 మందికి టెస్ట్లు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చినట్ల్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవా ఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్, హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ తెలిపారు.
నందిపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్ తెలిపారు. మొత్తం 45 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని, బాధితులకు మెడికల్కిట్లు అందజేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టెస్టులు కొనసాగుతున్నాయి. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 38 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో 28 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి తెలిపారు.
రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి చెక్పోస్టు వద్ద గురువారం 44 మందికి కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్ట ర్ క్రిస్టినా తెలిపారు. మాక్లూర్ మండలంలోని కల్లడి, మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. కల్లడిలో 33 టెస్టులు నిర్వహించగా ఆరుగురికి, మాక్లూర్లో 24 మందికి టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. 56 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్ల అందజేశామన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం 38 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చిన ట్లు డాక్టర్ నవీన్ తెలిపారు.ధర్పల్లి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 34 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పది మందికి పాజిటివ్ వచ్చినట్లు మం డల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లను అందజేసి తీసుకోవాల్సిన జా గ్రత్తలపై సూచించినట్లు పేర్కొన్నారు. వర్నిలో 42 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.