నందిపేట్ రూరల్, జూలై 12: మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీవన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వీడీసీ భవనం, వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన రైతు ధర్పల్లి నర్సయ్య ప్రమాదవశాత్తు చనిపోగా ఆయన కుటుంబానికి రైతుబీమా ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవే శ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సయ్య, ఎంపీపీ వాకిడి సంతోష్రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమేశ్, జడ్పీటీసీ ఎర్రం యుమునాముత్యం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
మాక్లూర్, జూలై 12 : మండల పరిషత్ కార్యాలయంలో డివిజన్స్థాయి అధికారులతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టిన పనులు, పూర్తిచేసిన పనులు, పెండింగ్లో ఉన్న పనుల గురించి అధికారులతో మాట్లాడారు. నెలలో ఒక సోమవారం అధికారులతో మండలాల వారీగా అభివృద్ధి పనులపై రివ్యూ సమావేశాన్ని నిర్వహిస్తానని, తప్పనిసరిగా వివరాలతో సమావేశానికి హాజరుకావాలని అన్నారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల లిస్ట్ను తనకు అందించాలని, సంబంధిత మంత్రులను కలిసి నిధుల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎంపీపీ మాస్త ప్రభార్, వైస్ ఎంపీపీ సుక్కి సుజాత, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికుల సేవలు అభినందనీయం
ఆర్మూర్, జూలై 12 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు గదిలో సోమవారం మండలంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సన్మాన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లింబారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గంగారెడ్డి, ఎంపీడీవో గోపీబాబు, సర్పంచులు పూజిత, సాయన్న, జమున, రాజేశ్వర్, లక్ష్మి, లింబాద్రి, సుమలత, లీనాశ్రీ, మోహన్రెడ్డి, సాయిలత, దయానంద్, సరోజన, నర్సయ్య, దేవి, సవిత, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ పవన్ పాల్గొన్నారు.